అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఆయన గన్నవరంలోని రైతు సాధికారత సంస్థ కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని అమలుచేస్తోందన్నారు. రైతులకు సేవచేస్తున్న వారిని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ పూర్తిచేసి తీరతామని ఆయన స్పష్టంచేశారు.