జమ్ముకశ్మీర్: భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తొయిబా అగ్రనేత అబు ఇస్మాయిల్ హతమయ్యాడు. జమ్ముకశ్మీర్లోని నౌగాం సెక్టార్లో ఉగ్రవాదులకు, భద్రతాసిబ్బందికి మధ్య ఎదురుకాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో అబు ఇస్మాయిల్తో పాటు మరో ఉగ్రవాది హతమయ్యాడు. అమర్నాథ్ యాత్రికులపై దాడి ఘటనతో అబు ఇస్మాయిల్ సంబంధమున్నట్లు సమాచారం.