పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో మిల్లులో పనిచేస్తున్న కార్మికులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. అయితే మిల్లు నుంచి భారీగా పొగలు రావడంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ షార్య్యూటే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తినష్టం లక్షల్లో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.