అహ్మదాబాద్: అహ్మదాబాద్లో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి శంకుస్థాపన కార్యాక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సభాస్థలికి చేరుకున్నారు. ముంబయి-అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. గతేడాది నవంబర్లో మోదీ జపాన్ పర్యటనలో భాగంగా బుల్లెట్ రైలు పథకానికి శ్రీకారం చుట్టారు. 2017లో బుల్లెట్ రైలు పథకానికి భూమిపూజ, 2018లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు.