హైదరాబాద్: శ్రీలంకను ఓడించినట్లుగా ఆస్ట్రేలియాను 5-0తో క్లీన్స్వీప్ చేయలేదు కానీ, కోహ్లీ నేతృత్వంలోని టీమిండానే వన్డే సిరీస్ నెగ్గుతుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టు ఇప్పటికే భారత్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ స్వదేశంలో భారత్ కఠిన ప్రత్యర్థి అయితే ఆస్ట్రేలియా జట్టు కూడా పటిష్టంగా ఉందని గంగూలీ పేర్కొన్నాడు. 'స్వదేశంలో భారత్ను ఓడించడం చాలా కష్టం. భారత్ సిరిస్ గెలిస్తుంది కానీ శ్రీలంకను ఓడించినట్లుగా ఆస్ట్రేలియాను 5-0తో క్లీన్స్వీప్ చేయలేదు' అని గంగూలీ అన్నాడు.
ఇక టీమిండియా సెలక్టర్లు అమలు చేస్తున్న రొటేషన్ పద్ధతిపై కూడా గంగూలీ స్పందించాడు. రోటేషన్ పద్ధతి మంచిదేనని... ప్రతీ యువ ఆటగాడిని పరీక్షించడం... భారత వరల్డ్ కప్ కోసం అత్యుత్తమ జట్టుని ఎంపిక చేసేందుకు ఇది మేలు చేస్తుందని గంగూలీ తెలిపాడు. టీమిండియా వెటరన్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ కథ ముగిసిపోలేదని, పునరాగమనానికి అవకాశం ఉందని తెలిపాడు. సెప్టెంబర్ 17న చెన్నైలో జరిగే తొలి వన్డేతో ఈ ఐదు వన్డేల సిరిస్ ఆరంభం కానుంది.