శుక్రవారం జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు భారత్ 325 పరుగులు చేయగా దానికి సమాధానంగా న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 62 పరుగులకే ఆలౌటైంది.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (4/19), పేసర్ మహ్మద్ సిరాజ్ (3/19)వీరిద్దరూ ఏడు వికెట్లు పంచుకోవడంతో భారత బౌలర్లు న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ను చీల్చడంతో 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది భారత్.
న్యూజిలాండ్ తరఫున ఎనిమిదో ర్యాంకర్ కైల్ జేమీసన్ 17 పరుగులతో టాప్ స్కోర్ చేయగా, కెప్టెన్ మరియు ఓపెనర్ టామ్ లాథమ్ (10) పరుగులు చేసాడు.
అంతకుముందు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో మొత్తం 10 వికెట్లు తీసిన మూడో బౌలర్గా రికార్డ్ లో నిలిచాడు. దేవితో భారత్ రెండో సెషన్లో 325 పరుగులకు ఆలౌట్ అయింది.
స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 109.5 ఓవర్లలో 325 ఆలౌట్ (మయాంక్ అగర్వాల్ 150, అక్షర్ పటేల్ 52, శుభ్మన్ గిల్ 44; అజాజ్ పటేల్ 10/119).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 28.1 ఓవర్లలో 62 ఆలౌట్ (కైల్ జేమీసన్ 17, టామ్ లాథమ్ 10; రవిచంద్రన్ అశ్విన్ 4/8, మహ్మద్ సిరాజ్ 3/19).