రైతులకు జగనన్న ఇళ్ల పట్టాలు గృహాలు మంజూరయ్యాయి. అయితే కేవలం 10 శాతం కూడా లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం ఇచ్చే లక్షా ఎనభై వేల రూపాయలు కూలీలకు మాత్రమే సరిపోతాయని, ఇల్లు కట్టుకోవడానికి పెట్టుబడి డబ్బు తమ దగ్గర లేదని లబ్ధిదారులు తెలిపారు. అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఇల్లు నిర్మించుకునే వెంటపడిన ఫలితం దక్కడం లేదు. ప్రభుత్వమే తమకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.