గోవాలో జరిగిన జాతీయ స్థాయి అండర్- 20 అండర్ 17 కబడ్డీ పోటీలు ఆంధ్రా జట్టు విజేతలుగా నిలిచినట్లు యూత్ గేమ్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ సాత్రి రామచంద్రుడు తెలిపారు. కర్నూలు జిల్లా అవుకు లో కట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శిక్షణ అనంతరం గోవాకు బయలుదేరిన ఆంధ్రా జట్టు జాతీయ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచాయి. జట్టు విజయానికి కీలక పాత్ర వహించిన శంకర్ , సతీష్ లకు బెస్ట్ రైడర్ , బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించాయి. ఆంధ్ర ప్రదేశ్ కబడ్డీ జట్టు విజయం పట్ల యూత్ గేమ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అసోసియేషన్ సెక్రటరీ చిన్న హనుమన్న మరియు అసిస్టెంట్ సెక్రటరీ సతీష్ టీం కోచ్ వినోద్ హర్షం వ్యక్తం చేశారు మరియు చెన్నంపల్లి కాట్రెడ్డి యువసేన ఆనంద సంబరాలు చేసుకున్నారు.