తూర్పు గోదావరి: రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ పై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉభయగోదావరి జిల్లాలను కలిపే రాజమండ్రి - కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి మీదుగా కొవ్వూరు వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వృద్ధ దంపతులను మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో భార్య చావా నాగమణి (59) అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలవడంతో స్థానికులు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరిని అరికరేవుల గ్రామవాసులుగా గుర్తించారు.