గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైన ఘటన తుళ్ళూరు మండలం లోని మందడం దళితవాడలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మందడం లోని దళితవాడకు చెందిన పత్తిపాటి నాగమణి (35), ఆమె భర్త విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయంలో పనిచేస్తున్న గుంటూరు లోని తుపాను నగర్కు చెందిన డేవిడ్రాజుతో పరిచయం ఏర్పడి ఇద్దరూ కలిసి సన్నిహితంగా ఉంటున్నారు. ఆదివారం రాత్రి నాగమణి కోసం డేవిడ్ రాజు మందడం వచ్చాడు.
అతడితో డ్వాక్రాలో నెలనెలా చెల్లించాల్సిన సొమ్ము గురించి ఆమె గొడవ పడింది. ఈ క్రమంలో పెద్దగా కేకలు వేస్తుండడంతో డేవిడ్రాజు టవల్తో ఆమె గొంతును గట్టిగా బిగించడంతో ఊపిరాడక చనిపోయింది. భయపడిన డేవిడ్రాజు గది లోని ఫ్యాన్కు టవల్ కట్టి, నాగమణి మెడకు బిగించి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చిత్రీకరించాడు. సమాచారం అందుకున్న తుళ్ళూరు పోలీసులు సోమవారం ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.