గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి మహానాడులో నివసించే నరసింహారావు అనే వ్యక్తి పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఘటనపై బాధితుడు శనివారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం నారా లోకేష్ పర్యటనలో బాధితుడు పాల్గొన్నాడని, ఈ నేపథ్యంలోనే అతనిపై దాడి జరిగినట్లు పలువురు అనుమానం వ్యక్తం చేశారు. సదరు ఘటనపై మంగళగిరి డిఎస్పి రాంబాబు ను వివరణ కోరగా ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని, బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితుడు ఫిర్యాదులో ఎలాంటి రాజకీయ కోణాలు విశ్లేషించలేదని అయినప్పటికీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని అన్నారు.