ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికుల రద్దీ దృష్ట్యాఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 23, 2017, 03:18 PM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లిలోని ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ విస్తరించనున్నట్లు జీఎమ్మార్‌ ప్రకటించింది. ఇందుకోసం జీఎమ్మార్‌ సంస్థ ఇప్పటికే విమానాశ్రయం విస్తరణ అనుమతులు పొందింది. ప్రస్తుతం ఉన్న టర్మినళ్ల సామర్థ్యం పెంపు, కొత్తగా మరో రన్‌వే అందుబాటులోకి తెస్తామని జీఎమ్మార్‌ సీఈవో  వెల్లడించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఢిల్లి మెట్రో రైల్‌ కూడా అన్ని టర్మినళ్లకు అనుసంధానించేలా విస్తరిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com