మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుడు కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ జైలు నుంచి విడుదలయ్యారు. తొమ్మిదేళ్ల నుంచి జైళ్లోనే ఉన్న పురోహిత్.. సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తలోజా జైలు నుంచి బయటకు వచ్చారు. శ్రీకాంత్ పురోహిత్ పై వచ్చిన అభియోగాలకు సరైన ఆధారాలు లేవని ఇప్పటికే ఆయన తరుపు న్యాయవాదులు వాదిస్తున్నారు. కల్నర్ శ్రీకాంత్ పురోహిత్ విడుదల సందర్భంగా ఆర్మీ ఆయనకు ప్రత్యేక ఎస్కార్ట్ ను ఏర్పాటు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన కల్నల్ పురోహిత్ ను ఆర్మీ అధికారులు తమ వాహనంలో తీసుకెళ్లారు.