అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సచివాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య సంచలనం సృష్టిస్తున్నది. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఏపీ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ రాజగోపాల్ కు అప్పులు ఎక్కువవడంతో బాధను తట్టుకోలేక.. తన బాధను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తో పంచుకుందామని వెలగపూడిలోని సచివాలయానికి శుక్రవారం ఉదయం వచ్చాడు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూశాడు. కాని.. సీఎం అపాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో జీవితం పై విరక్తి చెందిన రాజగోపాల్ తన అప్పుల బాధను తట్టుకోలేక తనతో పాటు వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగేశాడు. దీన్ని గమనించిన సచివాలయ సిబ్బంది రాజగోపాల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన మృతి చెందాడు.