అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూలు జిల్లా నంద్యాలకు బయలుదేరారు. నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ అభ్యర్ధిగా భూమా బ్రహ్మానందారెడ్డి పోటీలో ఉండగా ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శని, ఆదివారాల్లో చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.