తన భర్తతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ మహిళ మరో మహిళపై దాడికి దిగింది. ఈ ఘటన ఈ నెల 15న మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. ఆమె ఎవరో తనకు తెలియదని భర్త చెప్పినా భార్య వినిపించుకోలేదు. చివరికి భార్యాభర్తలిద్దరూ పోలీస్ స్టేషన్కు వెళ్లి పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.