ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరఖ్‌పూర్ ఘటనపై యూపీ ప్రభుత్వానికి నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2017, 03:02 PM

గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రి ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్సీ) స్పందించింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. చిన్నారుల మృతిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఐదు రోజుల్లోనే 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం విదితమే. చిన్నారుల మృతిని సుమోటోగా స్వీకరించాలని సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. లక్నో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది. అయితే చిన్నారుల మృతికి కారకులెవరైనా వదిలిపెట్టబోమని యూపీ సీఎం యోగి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com