ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధానితో తమిళనాడు సీఎం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 11, 2017, 03:23 PM

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. దాదాపు అర్థగంట పాటు వీరిద్దరి మధ్య చర్చలు సాగాయి. ఏఐఏడీఎంకే పార్టీలోని ప్రత్యర్థి వర్గాలన్నీ ఏకమవుతున్నట్టు ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ పళనిస్వామి ప్రధానితో భేటీకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ వారాంతానికల్లా పార్టీలోని ఇరువర్గాలూ విలీనం కానున్నట్టు సీఎం పళని ప్రధానికి వివరించినట్టు చెబుతున్నారు. మరోవైపు తమిళనాడు మాజీ సీఎం, జయలలిత విధేయుడు పన్నీర్‌సెల్వం కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చినట్టు చెబుతున్నప్పటికీ... ఈ ఇద్దరు నేతలూ పార్టీ సమన్వయం కోసం చర్యలు చేపట్టనున్నట్టు కనిపిస్తోంది. విలీనానికి మార్గం సుగమం చేసేలా ఇప్పటికే ఏఐఏడీఎంకే నేతలు ఆ పార్టీ డిప్యూటీ చీఫ్, శశికళ మేనల్లుడు దినకరన్‌ను పదవినుంచి గెంటేసిన సంగతి తెలిసిందే. దినకరన్ నియామకం అక్రమంగా జరిగిందనీ ఆయనకు కట్టబెట్టిన పదవి చెల్లదనీ, ఆమోదయోగ్యం కాదని ఏఐఏడీఎంకే ఓ తీర్మానం కూడా ఆమోదించింది. ఆఫీస్ బేరర్ల నియామకం సహా పార్టీ విషయంలో దినకరన్ తీసుకున్న నిర్ణయాలన్ని రద్దు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com