జమ్ముకశ్మీర్: ఓ ప్యాసెంజర్ వాహనం అదుపు తప్పి లోయలో పడిన ఘటన దోడ దగ్గర ఉన్న చిరాల లో జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పడంతో.. పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనం తుక్కుతుక్కయింది. వాహనం లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించగా... మరో 9 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.