వివాహం అయి రెండు నెలలు కూడా గడవక ముందే డబ్బు, బంగారంతో ఆ యువతి ఉడా యించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని రామ్పూర్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు..రామ్పూర్కు చెందిన ఇర్ఫాన్కు అదే ప్రాంతానికి చెందిన ఇక్రా అనే యువతితో ఆగస్ట్లో వివాహమైంది. ఆమె అందచందాలను చూసి ఫిదా అయిపోయిన ఇర్ఫాన్ ఆమెలోని మోసాన్ని గ్రహించలేకపోయాడు. పెళ్లయి నెల దాటింది. రెండు నెలలు కూడా గడవలేదు. కాపురం సాఫీగా సాగిపోతోంది. కానీ ఇటీవల ఒకరోజు రాత్రి భర్తకు రోజూలానే పాలు తెచ్చి తాగమని ఇచ్చింది. భార్య కుట్ర తెలియని ఇర్ఫాన్ ఆ పాలు తాగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్పృహ కోల్పోయాడు. ఇక్రా ఆ తర్వాత ఇంట్లోని 50 వేల డబ్బుతో పాటు, బంగారు నగలను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లపోయింది.
మెలకువ వచ్చి చూసేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడం, పాలు తాగిన వెంటనే తాను మత్తులోకి వెళ్లిపోవడంతో భార్య కుట్ర అప్పుడు ఇర్ఫాన్కు అర్థమైంది. ఇంట్లో చూస్తే డబ్బు, బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో.. ఇక్రా బుద్ధేంటో ఇర్ఫాన్కు పూర్తిగా అర్థమైంది. పోలీసులకు తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. ఇక్రా కుటుంబ సభ్యులు కూడా కూతురు ఇక్కడకు రాలేదని, ఎక్కడికి వెళ్లిందో తమకు తెలియదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఆమె ఫోన్ కూడా స్విచాఫ్ వస్తోంది. పోస్ట్ ద్వారా తన ఫిర్యాదు కాపీని రామ్పూర్ ఎస్ఐకి ఇర్ఫాన్ పంపించాడు. అంతేకాదు, సీఎం పోర్టల్లో కూడా రిపోర్ట్ చేశాడు. సెప్టెంబర్ 10 నుంచి ఇర్ఫాన్ భార్య కనిపించకుండా పోయింది. పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.