అనంతపురం: ధర్మవరం పట్టణంలోని గాంధీనగ లో సోమవారం రాత్రి మనోజ్ కుమార్ అనే యువకుడిపై చరణ్ అనే యువకుడు బీరుసీసాతో దాడి చేశాడు. గాయపడిన బాధితుడిని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మనోజ్ కుమార్, చరణ్ లు స్నేహితులు కాగా కొనుగోలు చేసిన బీరు సీసా ఇవ్వడానికి నిరాకరించడంతో తనపై చరణ్ సీసాతో దాడి చేశాడని పట్టణ పోలీసులకు మనోజ్ కుమార్ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.