కొలంబో: భారత్తో జరుగుతున్న రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్లో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోరు 50/2తో మూడో రోజు బ్యాటింగ్ కొనసాగించిన లంకకు భారత బౌలర్లు షాకిచ్చారు. మెండిస్, కెప్టెన్ చండీమల్ వికెట్లను వెంటవెంటనే తీసిన భారత బౌలర్లు లంకను కష్టాల్లో పడేశారు. 24 పరుగులు చేసిన మెండిస్ను ఉమేష్, 10 పరుగులు చేసిన చండీమల్ను జడేజా అవుట్ చేశారు. ప్రస్తుతం లంక 29 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. మ్యాథ్యూస్ 10, డిక్వెలా 14 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే 538 పరుగులు వెనకబడి ఉంది.