బీహార్ రాష్ట్రంలోని కటిహార్ నగర మేయరు శివరాజ్ పాశ్వాన్ ను గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. మేయర్ శివరాజ్ పాశ్వాన్ విధులు ముగించుకొని గురువారం రాత్రి కారులో ఇంటికి వస్తుండగా సంతోషి మందిర్ చౌక్ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మేయర్ శివరాజ్ ను హుటాహుటిన కటిహార్ మెడికల్ కాలేజీకి తరలించారు. మూడు బుల్లెట్ గాయాలైన మేయర్ శివరాజ్ మరణించాడని వైద్యులు ప్రకటించారు. కాల్పులు జరిపిన వారికోసం గాలిస్తున్నామని కటిహార్ డీఎస్పీ అమర్ కాంత్ ఝా చెప్పారు.