కొలంబో : పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిదికి ఇచ్చిన విరాట్కోహ్లీ జెర్సీని వేలం నిర్వహించారు. అఫ్రిది ఓ స్వచ్చంద సంస్థను ఎస్ఏ పౌండేషన్ పేరుతో నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారంనాడు లండన్లో అఫ్రిది ఓ ప్రత్యేక విందుకార్యక్రమం ఏర్పాటు చేసి తన దగ్గర ఉన్న క్రికెట్ వస్తువులను వేలం నిర్వహించాడు. ఇందులో కోహ్లీ జెర్సీ రూ 4300 యూరోలకు (రూ 325740) అమ్ముడుపోయింది. దీంతో పాటు తన వద్ద ఉన్న పలువురి ఆటగాళ్ల జెర్సీలను సైతం వేలం నిర్వహించాడు. ఇందులో వచ్చిన నగదును తన పౌండేషన్కు ఇచ్చి దాని ద్వారా చిన్నారుల విద్యకోసం వినియోగించనున్నాడు.
2016 లో భారత్లో నిర్వహించిన టీ 20 ప్రపంచకప్టోర్నమెంట్ సమయంలో కోహ్లీ తన జెర్సీని అఫ్రిదికి అందించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ఆటగాళ్లు అంతా తమ సంతకాలు చేశారు. కాగా అఫ్రిది లండన్లో నిర్వహించిన వేలంపాటకు క్రికెటర్లు అమీర్తోపాటు ఇమాద్ వసీం హాజరయ్యారు.