బెంగళూరు : కర్నాటకలో ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కనకపురా, సదాశివనగర్లోని మంత్రి డీకే శివకుమార్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈగ్లెటన్ గోల్ఫ్ రిసార్ట్స్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గదుల్లో ఐటీ శాఖ దాడులను కొనసాగిస్తున్నది. గుజరాత్ లో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (గుజరాత్ ఎమ్మెల్యేలు) బెంగళూరులోని ఈగ్లెటన్ గోల్ఫ్ రిసార్ట్స్కు వచ్చారు. ఎమ్మెల్యేల బృందానికి మంత్రి డీకే శివకుమార్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 8న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో 44 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్ఠానం తాము అధికారంలో ఉన్న కర్ణాటకకు తరలించిన విషయం తెలిసిందే.