ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 03, 2021, 12:27 PM

విజయవాడ : ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన 6వ రోజు కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ESI ఆసుపత్రులు నల్ల బ్యాడ్జిలతో తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఉపాద్యక్షులు కొడాలి శేషయ్య మాట్లాడుతూ DA, PRC అనేది ఉద్యోగుల హక్కు మరియు పెరిగిన నిత్యావసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు స్వచందంగా అమలు వాటి విషయంలో కమిటీలు, నివేదికల పేరుతో తాత్సారం చేస్తూ ఉద్యోగులను అప్పుల పాలు చేస్తున్నాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ ESI ఆసుపత్రులలో స్పెషల్ గ్రేడ్, సివిల్ సర్జనుల కొరతతో పేదలకు అందించాల్సిన వైద్యం అందించలేకపోతున్నారని అన్నారు. ల్యాబ్ టెక్నిషియన్లు, నాలుగవ తరగతి సిబ్బంది నియమించకపోవటంతో అనేక ఆసుపత్రులలో ఆపరేషన్లు అరకొరగా సాగుతున్నాయని తెలిపారు. శాంతియుత పద్దతిలో వైద్యరంగంలోని సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోని వెళ్ళుటలో భాగంగా నిరసన కార్యక్రమాలు చేపట్టమన్నారు. ప్రభుత్వం స్పందించకపోయిన యడల న్యాయమైన డిమాండ్ల సాధనలో భాగంగా మరింతగా ఉద్యమానికి సిద్ధం కావాల్సిందిగా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ESI హాస్పిటల్స్ మిద అవగాహన లేని అధికారాలను అజమాయిషిగా చేసి ఆసుపత్రులు, డిస్పెన్సారిలను నీరు గారుస్తున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com