దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 44,111 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న వైరస్ కారణంగా 738 మంది మృత్యువాత పడ్డారు. కాగా మరణాల సంఖ్య ఏప్రిల్ 8నాటి కనిష్ఠానికి చేరింది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,05,02,362కు మృతుల సంఖ్య 4,01,050 కు పెరిగింది. నిన్నఒక్కరోజే 57,477 మంది వైరస్ బారినుండి కోలుకున్నారు. దేశంలో రికవరీలు 2.96 కోట్ల మార్కును దాటాయి. నిన్న 43,99,298 మంది టీకాలు వేయించుకున్నారు.