కర్నూల్ జిల్లా, నగానపల్లి మండలం యాగంటి పల్లె వద్ద గాలేరు-నగరి కాలువ సమీపంలో తెలంగాణ రాష్ట్రం నారాయణ పేట జిల్లా మరేకల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన బాలిక (15) మృతి ఆత్మహత్యేనని డోన్ డీఎస్పీ నరసిం హారెడ్డి పేర్కొన్నారు. పోలీసులు మొదట అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోలీసులు దర్యాప్తు చేశారు. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతుండడంతో తండ్రి మందలించాడు. అదే రోజు రాత్రి వారు నివసిస్తున్న గుడిసెలో ఎవరూ లేని సమయంలో ఓ చెంబులో డీజిల్ తీసుకెళ్లి నిప్పంటించుకున్నట్లు డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.