ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని అన్ని జిల్లాల డిఎంహెచ్వో లతో గురువారం టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించారు. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలపై ఫోకస్ పెట్టాలని సూచించారు. రానున్న 6 వారాల్లో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించడంతో.. కేసులు ఎక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. వైరస్ వ్యాప్తి గతాని కంటే వేగంగా ఉందని, ఆసుపత్రుల్లో బెడ్స్ ను సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కరోనా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.