విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పిటిషన్ పై కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగగా.. మాజీ జేడీ లక్ష్మీ నారాయణ తరపున లాయర్లు ఆది నారాయణ, బాలాజీ వదేరా లు వాదనలు వినిపించారు. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రానికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రైవేటీకరణపై నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కేంద్రాన్ని కోరామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను ఏపీ హైకోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.