దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. చాలా నెలల తర్వాత 10 వేలలోపే నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,102 మంది మాత్రమే కరోనా వైరస్ బారినపడ్డారు. జూన్ 4వ తేదీ తర్వాత ఇంత తక్కువ స్థాయిలో రోజువారీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక కరోనాకు చికిత్స పొందుతూ నిన్న 117 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నిన్న 15,901 ఈ మహమ్మారిబారి నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉంటే ఇవాళ్టి ఉదయం వరకు దేశవ్యాప్తంగా 20 లక్షల 21వేల మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మొత్తం కేసులుః 1,06,76,838
యాక్టివ్ కేసులుః 1,77,266
మొత్తం కోలుకున్నవారుః 1,03,45,985
మరణాల సంఖ్యః 1,53,587
దేశవ్యాప్తంగా నిన్న 7.25 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటిదాకా మొత్తం 19.30 కోట్ల శాంపిల్స్ పరీక్షించినట్టు వెల్లడించింది.