టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి, లభ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ భారత కమ్యూనిష్ణు పార్టీ , ఆంద్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆద్వర్యంలో గాంధి నగర్ దాసరి భవన్ వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 58 వేల మందికి టిడ్కో గృహాలు ఇవ్వాల్సీండగా కేవలం 2 లక్షల 60 వేల మందికి మాత్రమే టిడ్కో గృహాలను కేటాయించిందని మండిపడ్డారు. ప్రతి ఇంటికి మౌళిక వసతుల కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు ప్రతి కుటుండానికి ఒక సెంటు ఇంటిస్ధలాన్ని ప్రభుత్వం ఇస్తున్నామంటుందని ఒక సెంటు స్ధలం ఒక కుటుంబానికి ఎలా సరిపోతుందని ఆయన ప్రశ్నించారు.