ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడిలో రక్తం ముద్రల కలకలం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 22, 2020, 05:18 PM

ప్రకాశం జిల్లా దర్శి పడమటి బజార్ లోని శ్రీకృష్ణుడి గుడిలో గుర్తు తెలియని వ్యక్తులు రక్తం ముద్రలు వేయడంతో కలకలం రేగింది. గుడి ఆవరణలో జంతువుని వధించి.. చేతికి నెత్తురు అంటించుకొని దుండగులు గుడి గోడలకు పూశారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శిలాఫలకానికి కూడా రక్తం పూశారు. ఉదయం గుడికి వచ్చిన పూజారి.. రక్తం మరకలను చూసి ఆందోళనకు గురయ్యాడు. స్థానికులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తులను ఆందోళనకు గురి చేసేందుకు రక్తం పూసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com