ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 04, 2020, 04:57 PM

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్. లాయర్లుగా ప్రాక్టీస్ చేస్తున్నవారికి మంచి అవకాశం వచ్చింది. 55 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేసుకోవచ్చు. అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 55 సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. 55 పోస్టుల్లో 18 పోస్టులు మహిళలకు కేటాయించడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 2, 2021 దరఖాస్తుకు చివరితేది. ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 1, 2020 నాటికి 35 ఏళ్లు మించని వాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి దరఖాస్తు ఫీజు రూ.800లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400 పే చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో చేరిన వారికి రూ.27,700లు నుంచి రూ.44,770లు ఇవ్వడం జరుగుతుంది. లాయర్‌గా మూడేళ్లు పాటు ప్రాక్ట్రీస్ చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు. ఏదైనా గుర్తింపు గల యూనివర్సిటీ నుంచి లా పూర్తి చేసి ఉండాలి. అలాంటివాళ్లు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ పోస్టులను స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.
ఇందులో 40 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్‌ చేసిన వారికి మళ్లీ రిటన్ టెస్ట్ పెడతారు. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. సివిల్ లాస్, క్రిమినల్ లాస్, ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్‌పై ఇందులో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌ 100 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్‌కు మూడు గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మెరిట్ సాధించిన వారిని ఉద్యోగాలకు సెలక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ టెస్ట్‌ లకు గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు జనవరి రెండో తేదీ కల్లా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు http://hc.ap.nic.in/ వెబ్‌ సైట్‌ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. జనవరి రెండో తేదీ 11 గంటల 59 నిమిషాల కల్లా అప్లై చేసుకోవాలి. చేతితో రాసిన, టైప్ చేసిన, ప్రింటెడ్ అప్లికేషన్ల ఏ మాత్రం స్వీకరించడం జరగదని నోటిఫికేషన్‌లో తెలియజేయడం జరిగింది. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఎక్కడ పెడతారు..? ఏ డేట్‌లో పెడతారనే విషయాలను తెలియజేయడం జరుగుతుంది. 55 పోస్టులతో పాటు మరో 13 పోస్టులను ట్రాన్సఫర్ పద్ధతిలో రిక్రూట్ చేయడం జరుగుతుంది. అంటే 55 పోస్టులను డైరక్ట్‌గా రిక్రూట్ చేయడం జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com