కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు వ్యక్తమవుతుంది. తాజాగా ఓ పెళ్లి కొడుకు రైతుకు మద్దతు పలికాడు. రైతులకు మద్దతుగా శుక్రవారం ఓ పెళ్లి కుమారుడు ట్రాక్టర్ తోలాడు. హర్యానాలోని కర్నాల్కు చెందిన వరుడు.. తన వద్ద ఉన్న లగ్జరీ కారును వదిలేసి..పెళ్లి వేదిక వద్దకు ట్రాక్టర్పై వెళ్లారు. ఆందోళనలు చేపడుతున్న రైతులకు మద్దతు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ వరుడు ఇలా చేశాడు. మనం నగరాలకు వలస వెళ్తున్నా, వ్యసాయం మాత్రం మనకు ప్రాథమికమైందని, రైతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, రైతులకు ప్రజా మద్దతు ఉందన్న విషయాన్ని చెప్పేందుకు తాను ట్రాక్టర్పై వెళ్లినట్లు వరుడు తెలిపాడు. మరోవైపు రైతుల ఉద్యమం తొమ్మిదివ రోజుకు చేరుకున్నది. ఢిల్లీ సరిహద్దులో అన్ని ప్రాంతాలను స్తంభింప చేశారు. ఘజియాబాద్-ఢిల్లీ మధ్య ఉన్న ఎన్హెచ్-24 హైవేను మూసివేశారు. సింఘు, లాంపూర్, ఔచాంది, సైఫాబాద్, పియావ్ మనియారి, సబోలీ సరిహద్దులను శాశ్వతంగా మూసివేశారు. ఎన్హెచ్-44ను రెండు వైపులా మూసివేశారు. మరోవైపు రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.