విశాఖలో భూ ఆక్రమణలు, దందాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘విశాఖలో అడ్డగోలుగా ఆక్రమణలు, బెదిరింపులు, భూదందాలు. ప్రతి భూ దందా వెనుక అధికార పార్టీ నేతలున్నారని, నాడు నేడులో అవినీతి రాజ్యమేలుతోందని నేడు మీ నాయకులే చెప్తున్నారు. 17నెలల్లో విశాఖలో జరిగిన భూలావాదేవీలు, దందాలపై సిబిఐ విచారణ కోరి వెనుక ఎవరున్నారో చెప్పే ధైర్యం ఉందా?’’ అని దేవినేని ఉమా ప్రశ్నించారు.