ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబరాబాద్ సృష్టి కర్త చంద్రబాబు : ఆలపాటి రాజా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 23, 2020, 02:10 PM

సామాన్యుడికి రాజకీయం నేర్పింది టీడీపీయేనని మాజీ మంత్రి ఆలపాటి రాజా పేర్కొన్నారు. ఎంతో మంది పార్లమెంటు సభ్యులుగా టీడీపీలో పని చేశారన్నారు. దళితుడిని జిల్లా పార్లమెంటు అధ్యక్షుడిగా చేసిన ఘనత టీడీపీదేనన్నారు. జిల్లా నాయకత్వం వహించనున్న శ్రావణ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. సైబరాబాద్ సృష్టి కర్త చంద్రబాబు అని ఆలపాటి రాజా పేర్కొన్నారు. సైబరాబాదు లేకపోతే హైదరాబాద్ ఎడారి అయ్యేదన్నారు. దాతృత్వంతో ఏర్పడిన అమరావతిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించేలా పోరాటం చేయాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com