ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్ జిల్లాలో జరిగిన దారుణం రాజకీయ పార్టీల మధ్య రాజకీయ దుమారం రేపుతున్నది. యూపీలో అధికార బీజేపీపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సైతం హథ్రాస్ ఘటన విషయంలో బీజేపీపై మండిపడ్డారు. రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసమే హథ్రాస్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారని ఆమె ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా కుట్రలు చేయడంలో ఆరితేరిందని, కాంగ్రెస్ కుతంత్రాలు దేశ ప్రజలకు తెలుసని స్మతి ఇరానీ వ్యాఖ్యానించారు. అందుకే 2019 ఎన్నికల్లో జనం బీజేపీని గెలిపించారని చెప్పారు. ఈ రోజు రాహుల్గాంధీ రాజకీయ లబ్ధి కోసమే హథ్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు తప్ప, బాధితురాలికి న్యాయం చేయడం కోసం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.