ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ హథ్రాస్‌కు రాహుల్

national |  Suryaa Desk  | Published : Sat, Oct 03, 2020, 01:38 PM

హథ్రాస్ బాధిత కుటుంబాన్ని కలవడానికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల కిందట చేసిన ప్రయత్నాన్ని యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి వారిని కలిసేందుకు శనివారం మధ్యాహ్నం రాహుల్ హథ్రాస్‌ బయలుదేరనున్నారు. రాహుల్ వెంట కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సోదరి ప్రియాంక గాంధీ కూడా వెళతున్నారు. ‘హథ్రాస్ వెళ్లకుండా తనను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు.. అత్యంత దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాన్ని కలిసి వారి బాధను పంచుకుంటాను’అని రాుల్ గాంధీ ట్వీట్ చేశారు.


హథ్రాస్‌లో సిట్ దర్యాప్తు పూర్తికావడంతో మీడియాపై ఆంక్షలు ఎత్తివేసినట్టు అధికారులు ప్రకటించారు. అయితే, అక్కడ 144 సెక్షన్ కొనసాగుతుందని తెలిపారు. రాహుల్ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే ఆయన పర్యటనకు అనుమతిలేదని హథ్రాస్ జాయింట్ కలెక్టర్ ప్రేమ్ ప్రకాశ్ మీనా ప్రకటించడం విశేషం. గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతున్నందున పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండరాదని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి అనుమతిలేదు.. ప్రస్తుతం రాజకీయ పార్టీల నేతల పర్యటనపై నిషేధం కొనసాగుతోందని స్పష్టం చేశారు.


 


బాధితురాలిపై జరిగి క్రూరమైన దాడికి తోడు యూపీ పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును దేశం యావత్తు ముక్తకంఠంతో ఖండిస్తోంది. అర్ధరాత్రి 2.30 ప్రాంతంలో హడావుడిగా కుటుంబసభ్యులు లేకుండా అంత్యక్రియలు నిర్వహించడమే కాదు, బాధితులు ఎవరితోనూ కలవకుండా ఆంక్షలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రతిపక్ష పార్టీలే కాదు, సొంత పార్టీ నేతలు కూడా దీనిని గర్హిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com