ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన ‘అటల్ టన్నెల్’ ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఈ టన్నెల్ పూర్తికావాలన్నది కేవలం అటల్ బిహారీ వాజ్పాయ్ కల మాత్రమే కాదని, హిమాచల్ ప్రదేశ్ ప్రజల కల కూడా అని ఆయన అన్నారు. ఇంత శక్తిమంతమైన, ముఖ్యమైన టన్నెల్ సరిహద్దుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠ పరుస్తుందని, కొత్త బలాన్ని చేకూరుస్తుందని ప్రకటించారు. కొత్త కొత్త సంస్కరణలను తేవడం ద్వారా సరికొత్త, అధునాత ఆయుధాలు దేశంలోనే తయారు చేసుకోడానికి వీలవుతుందని అన్నారు.