తొట్లకొండ ప్రాంతంలో బౌద్దారామం విస్తరించి ఉన్న భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడం సరికాదని ఆంధ్ర బౌద్ధ భిక్షువు వెనరబుల్ దమ్మనంద భాంతే అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జిల్లా మహాబోధి సొసైటీ (విశాఖ) ఆధ్వర్యంలో ఎన్ఏడీ కొత్తరోడ్డులోని బుద్దుడి విగ్రహం వద్ద సభ్యులు నిరసన తెలిపారు. బౌద్దారామాలను పరిరక్షించి పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ది చేయాలని కోరారు. సొసైటీ అధ్యక్షుడు గునుపూడి బాబులు, ప్రధాన కార్యదర్శి బోర వేణుగోపాల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.