సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.సాయిబాబ 32 వార్డు సిపిఎం నాయకులు కె.సుధాకరప్ప తెలిపారు. ఈరోజు కర్నూలు పట్టణంలోని 32 వార్డు గంగావతి నగర్, గోవర్థన్ నగర్ కల్లుపెంట ఏరియా లలో ప్రజలతో సంభాషణ యాత్ర జరిగింది.ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను నాయకుల దృష్టికి తెచ్చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్లుపెంట ఏరియా లో సిపిరోడ్లు కాలువలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్లు కాలువలు వేయాలని డిమాండ్ చేశారు గోవర్థన్ నగర్ పార్క్ లో రైతు మార్కెట్ ఏర్పాటు చేయడానికి అక్కడ షెడ్లు తయారు చేస్తున్నారని అవి మధ్యలో ఆగిపోయింది వెంటనే షెడ్లు పూర్తి చేసి రైతు మార్కెట్ ను త్వరగా పూర్తి చేయాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. సంభాషణ యాత్ర లో సిపిఎం నాయకులు యస్.అక్బర్ జి.దేవేంద్ర. ఇ.రామాంజనేయులు యస్. షంషీర్. యం.శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.