బిజెపి విధానాలతో దేశం సర్వనాశనం కేంద్రంలో బీజేపీ విధానాలను, రాష్ట్రంలో వైసీపీ విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కమిటీ కర్నూల్ ఆధ్వర్యంలో జోహరాపురం17,18వార్డు లలో పై ఆటో స్టాండ్ విజయ్, దాసు,మాలగెరి సెంటర్లో రంగస్వామి, తప్పేట గేరి సెంటర్ లో వలి, అమీనా బీ, ఆధ్వర్యంలో మూడు సెంటర్లలో 250 మంది తో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ హాజరై మాట్లాడుతూ కేంద్రం లో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.కరోనా సాకు చూపి ప్రభుత్వ ఆస్తుల ను ప్రవేటు, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పీ దేశ ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని విమర్శించారు. బిజెపి వైసిపి ప్రభుత్వాలు దేశాన్ని ప్రజలను దివాలా తీస్తున్నారని,ఈ కార్యక్రమంలో బడు, మోహన్, మునుస్వామి, లక్మన్న, సoమ్సోన్,మధు, వెంకటయ్య, యేసు, భరత్, నూర్ వలి మరియు ప్రజలు కార్మికులు పాల్గొన్నారు.