పట్టణంలోని సాయి సమీరా హాస్పిటల్ లో దారుణం.శరీరంలో ఐరన్ తగ్గిందని సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటూ ఐరన్ ఇంజక్షన్ చేయటం తో ఇంజక్షన్ వికటించి ఒక మహిళ మృతి.వీరులపాడు మండలం చట్టన్నరం గ్రామానికి చెందిన కోట లక్ష్మి రెండు రోజుల నుండి నీరసంగా ఉండటంతో నందిగామ పట్టణంలో సాయి సమీర హాస్పటల్ కు వచ్చి జాయిన్ అయిన మహిళ.శరీరంలో ఐరన్ తక్కువగా వుండటం వల్ల నీరసంగా వుందని ఐరన్ ఇంజక్షన్ చేస్తే ఇబ్బంది వుండదని వైద్యలు తెలపడంతో కోట లక్ష్మి అనే మహిళ సరేనని వైద్యానికి సహకరించిందని తెలిపిన బంధువులు.సెలైన్ బాటిల్ పెట్టి ఐరన్ ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే కోట లక్ష్మి మృతి చెందినదని తెలుపుతున్న బంధువులు.మృతి చెందిన మహిళ బంధువులతో చర్చలు జరుపుతున్న హాస్పిటల్ సిబ్బంది