ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో కరోనా మరో రికార్డు..

national |  Suryaa Desk  | Published : Sat, Sep 05, 2020, 12:57 PM

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,59,346 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 86,432 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,23,179కి చేరింది. వీరిలో 8,46,395 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 31,07,223 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,089 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 69,561కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.73 శాతంగా ఉంది. అయితే, దేశం మొత్తం మీద క్రియాశీలక కేసుల సంఖ్య 15,271 మేర పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇది తగ్గడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com