కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు పట్టణంలో బిజెపి నేతలు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదివారం బండి ఆత్మకూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ప్రధాన కూడలిలో రోడ్డుపై మోకాలు లోతు గుంతలు ఏర్పడి ఏళ్ళ తరబడి ప్రజలు ఇక్కట్లు పడుతున్న ప్రజాప్రతినిధులకు పట్టడం లేదని నంద్యాల పార్లమెంట్ బిజెపి అధ్యక్షుడు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి పట్టడం లేదని ఆరోపించారు. బురద మాయమైన ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి బిజెపి నేతలు నిరసన వ్యక్తం చేశారు. మహానంది, శ్రీశైలం, ఓంకారం పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్డు పునఃరుద్ధరించాలని కోరారు.