ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసి కరోనా రోగి పరార్

national |  Suryaa Desk  | Published : Mon, Aug 17, 2020, 04:30 PM

అప్పుడే పుట్టిన శిశువును వదిలేసి ఓ మహిళ హాస్పిటల్ నుంచి పారిపోయింది. దీంతో కుటుంబసభ్యులతో పాటు హాస్పిటల్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలోని హిందూ రావ్ హాస్పిటల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. టిఓఐ కథనం మేరకు..హాస్పిటల్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన ఓ మహిళ తనకు డెలివరీ డేట్ దగ్గర పడటంతో కొన్ని రోజుల కిందట ఢిల్లీలోని హిందూ రావు హాస్పిటల్‌లో చేరింది. ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. గర్భిణి అయిన ఆ మహిళకు వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. ఆగస్టు 11న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మరుసటి రోజు ఉదయం హాస్పిటల్ సిబ్బంది కళ్లుగప్పి వార్డు నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు, హాస్పిటల్ వర్గాలు ఆమె కోసం గాలించగా ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని ఆ మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పుట్టిన శిశువుకు కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆ శిశువు వారి సంరక్షణలోనే ఉంది. అయితే.. పారిపోయిన మహిళ గురించే అందరూ ఆందోళన చెందుతున్నారు. ఆమె నుంచి మరి కొంత మందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని ఆందోళనకు గురవుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com