కరోనాతో పోరాడుతున్న అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఆరోగ్యం మరింత క్షీణించింది. నవనీత్ కౌర్ పరిస్థితి విషమంగా ఉండటంతో మొదట నాగ్పూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ కూడా మార్పు రాకపోవడంతో ముంబైలోని ప్రఖ్యాత లీలావతి ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజుల కింద ఈమె మామ గంగాధర్ రానాకు కరోనా సోకింది. ఆ తర్వాత ఆయన నుంచి కుటుంబం అంతా కరోనా బారిన పడింది.ఆమె భర్త.. పిల్లలకు కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ల పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉంది. ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఆర్పీ పట్నాయక్ హీరోగా వచ్చిన 'శీను వాసంతి లక్ష్మీ'తో పాటు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగలో యంగ్ యమా పాటలో మెరిసార్ కౌర్. మహారాష్ట్రలోని అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. నవనీత్ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆమె అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.