డి వై ఎఫ్ ఐ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కర్నూలు జిల్లా పెద్దకడబుర్ పట్టణంలో యువకులకు 100 మీటర్స్, 1600 మీటర్స్, షార్ట్ పుట్, తదితరుల పోటీలు నిర్వహించారు. దినికీ ఫిజికల్ డైరెక్టర్ జి. రాము నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు జి. రామన్న మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలకు లోబడి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. యువతి యువకులను ప్రోత్సాహించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు డి వై ఎఫ్ ఐ చేపడుతుందని తెలిపారు. క్రిడల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు.ప్రతి మండల కేంద్రంలో మీని స్టేడియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గెలుపోటములతో సంబంధం లేకుండా తమ ప్రతిభను కనపరచిన యువతను అభినందించారు. రాబోయే రోజుల్లో యువకులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి బి. చంద్ర, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి బి. సుధాకర్, పట్టణ అధ్యక్షకార్యదర్శులు జి. అబ్రహం, జి. శీను, తదితరులు పాల్గొన్నారు.