చాలా మందికి ఏసీ, టీవీ, ఫ్రిజ్ వంటి ఇంటి వస్తువులు కొనుగోలు చేయాలని ఉంటుంది. అయితే వారికి సరైన ఆర్థిక స్థోమత లేకపోవడం వల్ల లేదా ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొనలేని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇప్పుడు అటువంటి వారికి ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. ఏసీ, టీవీ, ఫ్రిజ్ వంటి వాటిని తక్కువ ధరకే కొనుగోలు చేయాలని భావించేవారికి అదిరిపోయే ఛాన్సు అందుబాటులో ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) తన వద్ద ఉన్న ఫర్నీచర్ సహా ఇతర ప్రొడక్ట్లను అమ్మకానికి ఉంచింది. కొనుగోలు చేయాలని భావించే వారు ఫర్నీచర్ సహా ఇతర వస్తువుల అమ్మకానికి సంబంధించి ఆగస్ట్ 31లోపు కొటేషన్ పంపాలని దీపం తెలిపింది. అంటే 31లోపు టెండర్లను సమర్పించాలి. eprocure.gov.in/eprocure/app లేదా dipam.gov.in ద్వారా టెండర్ డాక్యుమెంట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.టెండర్ సమర్పించిన వారు వస్తువులను కొనుగోలు తేదీ కన్నా ముందుగానే వెళ్లి చూసుకోవచ్చు. ఎక్కువ మొత్తానికి బిడ్ వేసిన వారికి వస్తువులు లభిస్తాయి. ఒక్కసారి వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఎలాంటి పరిస్థితుల్లోనూ మళ్లీ వెనక్కి తీసుకోమని ప్రభుత్వం తెలిపింది. దీపంలోని ఫర్నీచర్ సహా ఇతర వస్తువులను బిడ్డింగ్ ముగిసిన ఐదు రోజుల్లోగా కస్టమర్కు అందజేస్తారు. దీపం విక్రయించే ప్రొడక్టుల్లో వివిధ కంపెనీలకు చెందిన ఏసీలు, కూర్చీలు, టీవీలు, ఫ్రిజ్, ఎల్ఈడీ లైట్లు, కంప్యూటర్ వీల్ చైర్స్, ఫ్యాన్స్, టేబుల్స్, యూపీఎస్, సోఫా, స్టోరేజ్ ర్యాక్, అల్మారాలు వంటివి కూడా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా టెండర్ వేసి తక్కువ ధరకే టీవీ, ఏసీ, ఫ్రిజ్, ఇతర వస్తువులను సొంతం చేసుకోండి.